ఏపీలో కరోనా స్వైరవిహారం... 20 వేలకు పైగా కొత్త కేసులు

  • ఏపీలో కరోనా తీవ్రం
  • గత 24 గంటల్లో 86,878 కరోనా టెస్టులు
  • 20,345 మందికి కరోనా పాజిటివ్
  • ఒక్కరోజులో 108 మంది మృతి
  • తిరుపతి రుయా ఘటనతో పెరిగిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,345 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 2,371 కేసులు, అనంతపురం జిల్లాలో 1,992 కేసులు, గుంటూరు జిల్లాలో 1,919 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 14,502 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 108 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు కూడా ఉన్నారు.

ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి పెరిగింది. ఇప్పటివరకు 11,18,933 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8,899కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Pandemic
New Cases
Deaths
Today

More Telugu News